   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 25590 Registered: 12-2008 Posted From: 117.195.208.53
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Tuesday, June 18, 2013 - 10:49 pm: |
    |
కేంద్ర మంత్రి వర్గంలో ఎన్నడూ లేని విధంగా ఆంద్రప్రదేశ్ కు , ముఖ్యంగా కోస్తా ఆంద్రకు విశేష ప్రాధాన్యత లభించింది.ఏకంగా మూడు కేబినెట్ మంత్రి పదవులు రావడమే కాకుండా తొమ్మిది మందికి అవకాశం లభించింది.వారిలో ఒకరు రాయలసీమవారు కాగా మిగిలిన ఎనిమిది మంది కోస్తా జిల్లాలవారే కావడం విశేషం.ఇప్పటికే పల్లం రాజు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిగా క్యాబినెట్ హోదాలో ఉండగా , కిశోర్ చంద్రదేవ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా అదే హోదాలో ఉన్నారు. ఇప్పుడు జౌళి శాఖ బాధ్యతలతో కావూరి సాంబశివరావు క్యాబినెట్ హోదాలో నియమితులయ్యారు.వీరు కాకుండా మెగాస్టార్ చిరంజీవి స్వతంత్ర హోదాలో టూరిజం శాఖ మంత్రిగా ఉన్నారు. సహాయ మంత్రులుగా కిల్లి కృపారాణి, పనబాక లక్ష్మి,పురందేశ్వరి లు మంత్రులుగాఉండగా జెడి శీలం కొత్తగా మంత్రి అవుతున్నారు. రాయలసీమ నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మంత్రిగా ఉన్నారు.తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎస్.జైపాల్ రెడ్డి క్యాబినెట్ హోదాలో ఉండగా, సర్వే సత్యనారాయణ,బలరాం నాయక్ లు సహాయ మంత్రులుగా ఉన్నారు.గతంలో పివి నరసింహారావు ప్రధాని గా ఉన్నప్పుడు కూడా ఇంతమందికి అవకాశం రాలేదు.అందులోను ఇన్ని క్యాబినెట్ పోస్టులు దక్కలేదు. యుపిఎ మొదటి టరమ్ లో ఆంధ్రకు బాగా తక్కువ మంత్రి పదవులు ఉన్నాయన్న విమర్శ ఉండేది.కేవలం జైపాల్ రెడ్డి మాత్రమే క్యాబినెట్ హోదాలో ఉండేవారు.కారణం ఏదైనా ఈసారి ఆంద్రప్రదేశ్ ప్రాతినిద్యం బాగా పెరిగిందని చెప్పాలి. అయితే ప్రాంతాల సమతుల్యత చూస్తే ఇది కూడా విమర్శలకు గురికాక తప్పని పరిస్థితి ఉందని చెప్పాలి.కోస్తాకు ఎనిమిది పదవులు దక్కితే తెలంగాణకు మూడు పదవులే లభించినట్లు అవుతుంది.తెలంగాణ ఉద్యమం నేపధ్యంలో ఇది విమర్శలకు ఆస్కారం ఇస్తుంది.మొత్తం రాష్ట్రం ఒక యూనిట్ గా చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎపికి బాగా ప్రాముఖ్యం ఇచ్చినట్లు అవుతుంది. DB is for leg pulling,info share,timepass dont take all posts to heart/dil pe ..DB is Pressure Release |