| Author |
Message |
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 25175 Registered: 12-2008 Posted From: 117.195.208.175
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Tuesday, June 04, 2013 - 09:31 am: |
    |
జగన్ గ్రూప్ సంస్థల్లోకి వివిధ దేశీయ, విదేశీ సంస్థల నుంచి ఇబ్బడిముబ్బడిగా నిబంధనలకు విరుద్ధంగా కోట్లాది రూపాయలు వచ్చి చేరిన ఉదంతాలపై ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం కింద దర్యాప్తు చేస్తున్న ఈడీ రాబోయే రోజుల్లో ఈ ప్రక్రియను వేగవంతం చేయనున్నది. జగన్ కంపెనీలతో పాటు, నిమ్మగడ్డ ప్రసాద్కు చెందిన కంపెనీలకు చెందిన మరిన్ని ఆస్తుల అటాచ్మెంట్కు ఈడీ రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే షాక్ల మీద షాక్లిస్తున్న ఈడీ మరిన్ని షాక్లు ఇచ్చేందుకు సిద్ధ మవుతోంది. ఇదివరేక మూడు విడతల్లో రూ. 229.40 కోట్ల విలువ చేసే జగన్ కంపెనీల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. రూ. 34.66 కోట్ల డిపాజిట్లను స్తంభింపచేసింది. నాల్గో విడతలో రూ. 00 కోట్ల విలువ చేసే స్థిర, చరాస్తులను అటాచ్ చేయడానికి త్వరలోనే రంగంలోకి దిగనున్నది. ఇందులో భాగంగా హైదరాబాద్లోని లోటస్ పాండ్, బెంగుళూరు యలహంకలోని పెద్ద భవంతులను ఈడీ అటాచ్ చేయనున్నట్టు సమాచారం. ఈరెండు భవంతుల విలువ ఒక్కొక్కటి రూ. 50 కోట్ల మేర వుంటుందని సంబంధిత అధికారులు అంచనా వేశారు. వీటితో పాటు జగతీ పబిే్లకషన్స్కు చెందిన భవనాలు, సొంత ఛానల్కు చెందిన స్థిర, చరాస్తులను కూడా అటాచ్ చేయబోతున్నారని సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తున్నది. ఈ సంస్థలకు చెందిన కార్లు, ఇతర విలువైన చరాస్తులను కూడా అటాచ్ చేయనున్నారని వినికిడి. జగన్ కంపెనీలకు చెందిన జప్తు చేయబోయే ఆస్తుల విలువ ఈ విడతలో రూ. 40 కోట్లు వుండ వచ్చునని అంచనా. అలాగే నిమ్మగడ్డ ప్రసాద్ కంపెనీలకు చెందిన రూ. 15 వందల కోట్ల ఆస్తులను కూడా జప్తు చేయబోతున్నారని సమాచారం. ఇదే కనుక జరిగితే ఈడీ చరిత్రలోనే అతిపెద్ద అటాచ్ చేసిన ప్రాపర్టీగా రికార్డు కెక్కుతుంది. సిలికాన్ బిల్డర్స్ను ఒక ముసుగుగా పెట్టుకుని తాను అక్రమ ప్రయోజనాలను పొందారని జగన్పై ఈడీ అభియోగాలు మోపింది. మ్యాట్రిక్స్ ల్యాబ్స్కు అర్బన్ లాండ్ సీలింగ్ కింద మినహాయింపు ఇచ్చినందుకు ప్రతిఫలంగా ఆ కంపెనీ రఘురాం సిమెంట్స్లో మేజర్ పెట్టుబడిని పెట్టిందని ఈడీ అభిప్రాయపడింది. అలాగే ఆల్ఫావిల్లాస్, ఆల్ఫా అవెన్యూ, గిల్ క్లిస్ట్ కంపెనీలతో వ్యాపారం ప్రారంభించిన ప్రసాద్ తర్వాత ఈ మూడు కంపెనీల తరఫున పెట్టుబడులను జగన్ కంపెనీల్లో పెట్టారని సిబిఐ గుర్తించింది. ఇప్పటికే సిబిఐ దర్యాప్తు కీలక దశకు చేరుకున్న సమయం. మరో నాలుగు నెలల వ్యవధిలో సిబిఐ జగన్ అక్రమాస్తుల కేసులో తుది ఛార్జిషీట్ను వేయడానికి సన్నాహాలు ప్రారంభించింది. సెప్టెంబర్ వరకు బెయిల్ వచ్చే అవకాశం లేదు. బెయిల్ కోసం పిటీషన్ను సెప్టెంబర్ 9 తర్వాత ట్రయల్కోర్టులో వేసుకోవాలని జగన్ తరఫు న్యాయవాదిక సుప్రీం న్యాయస్థానం సూచించిన నేపథ్యం లో సెప్టెంబర్లో ఎలాగైనా బెయిల్కు గట్టి ప్రయ త్నాలు న్యాయపరంగా చేయాలని ఆలో చిస్తున్న తరుణంలో ఈడీ తన దర్యాప్తు, ఆస్తుల అటాచ్ మెంట్ ప్రక్రియను వేగవంతం చేయడంతో వైకా పా నాయకత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈసారి స్థిరాస్తులతో పాటు, చరాస్తులను కూడా అటాచ్ చేస్తుందని వార్తలు రావడంతో సొంత మీడియా మనుగడకు ముప్పువాటిల్లితే ఏం చేయాలని ఆలోచించి ప్రత్యామ్నాయంగా గతంలో సిద్ధం చేసుకున్న ప్రతిపాదనలను ముందుకు తెచ్చింది. రాబోయే కొద్ది నెలల్లో సొంత మీడియా కు ఆదాయం, ఖర్చు పొంతనలేకుండా మారి, నడవలేని పరిస్థితి ఎదురైతే ఈడీ సంస్థ తరఫున ప్రతినిధిగా వుండే అధికారి తనకున్న అధికార పరిధి మేరకు ఆ సంస్థల మూసివేతకు సిఫార్సు చేసే అవకాశం కల్పింస్తున్న నిబంధనలపై వైకాపా నాయకత్వంలోని కొందరు సమాచాలోచనలు జరిపారు. అదే గనుక తారసపడితే కొద్ది నెలలకల్లా ముందుగా అనుకున్న పేపర్, టీవీ నడిపే విషయంలో ఒక సినీనటుడి పేరుమీద రాసుకున్న ఒప్పందం ప్రకారం ముందుకు వెళ్ళాలని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. వైకాపా కార్యకలాపాల గురించి ఇదివరకటిలా గా ఇతర పత్రికలు, టీవీల్లో ప్రచారం రావడం లేదు. వ్యతిరేక వార్తలు మాత్రం హైలెట్ అవుతున్నాయి. ఎలాగో సొంత మీడియాలో అనుకూలంగా రాసుకుంటున్నారు గదా అని వైకాపా వ్యవహారాల గురించి ఇతర మీడియా లోపలి పేజీల్లో చిన్నతుంటలుగా వార్తలను ప్రచురిస్తోంది. సొంతమీడియా లేకుంటే తమకు రాజకీయంగా ఇబ్బందులు తప్పవని వైకాపా భావిస్తూ ముందస్తు జాగ్రత్తలపై మానసికంగా సిద్ధమయింది. మరోవైపు ఈనెల మూడోవారంలో ఈడీ కేసులో ప్రధాన నిందితుడిగా వున్న జగన్ను ప్రిజినర్ ట్రాన్స్ఫర్ కింద చెంచల్ గూడ జైలు నుంచి తీహార్ జైలుకు ఆర్థిక నేరాల కేసు విచారణ నిమిత్తం సంబంధిత న్యాయస్థానంలో ఈడీ పిటీషన్ను వేసే అవకాశాలు వున్నట్టు తెలుస్తున్నది. అందుకు ముందస్తుగానే మిగిలిన ఆస్తుల అటాచ్మెంట్ ప్రక్రియను ఓ కొలిక్కి తీసుకువస్తోందని సంబంధిత వర్గాలు అంటున్నాయి. ఈసారి తీహార్ జైలుకు తీసుకు వెళ్ళి, అక్కడి నుంచి న్యాయస్థానం అనుమతితో విచారించి, తర్వాత అధికారికంగా అరెస్టు చేస్తారని, ఆర్థిక నేరాల కేసులో ఒకసారి అరెస్ట యితే బెయిల్ రావడానికి కనీసం రెండుమూడేళ్ళు సమయం పడుతుందని సంబంధిత వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రాబోయే రోజుల్లో అక్రమాస్తుల కేసు, ఆర్థిక నేరాల కేసు సంబంధ అంశాల్లో తమ అధినేతకు ఎదురవ్వబోయే ఇబ్బందులను దృష్టిలో వుంచుకుని వాటిని న్యాయపరంగా అధిగమించేందుకు , సొంతమీడియాకు ఆటంకం కలిగితే మరో మీడియాను ప్రత్యామ్నాయంగా మరోపేరుతో తెరపైకి తెచ్చి, రాజకీయపరమైన ప్రయోజనాలు సాధించుకునేందుకు వైకాపా వ్యూహ రచనలో వున్నట్టు తెలుస్తున్నది. DB is for leg pulling,info share,timepass dont take all posts to heart/dil pe ..DB is Pressure Release |
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 25174 Registered: 12-2008 Posted From: 117.195.208.175
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Tuesday, June 04, 2013 - 09:29 am: |
    |
now onwards VARTHA Kosam MAHA Tv Choodam http://www.krishnapatrika.com/content_middle/content_middle_ 1.html DB is for leg pulling,info share,timepass dont take all posts to heart/dil pe ..DB is Pressure Release |
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 25173 Registered: 12-2008 Posted From: 117.195.208.175
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Tuesday, June 04, 2013 - 09:25 am: |
    |
Jagan benamis Bikku bikku mantu edusthunnaremo ...if any one knows how it to be a BENAMI ..avi pothunte ela untaadi please share ......
 DB is for leg pulling,info share,timepass dont take all posts to heart/dil pe ..DB is Pressure Release |
|