![]() ![]() ![]() ![]()
Seeker
Junior Artist Username: Seeker
Post Number: 285 Registered: 10-2016 Posted From: 66.188.92.138
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, February 22, 2017 - 07:08 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
నిష్ఠానికి శ్రీశైలం జలాశయం నుంచి సాగర్కు 25,777 క్యూసెక్కు ల నీరు విడుదల మరో 2 వారాల్లో 22 టీఎంసీలు వేసవిలో ఇరురాష్ట్ రాలకు తాగునీటి ఇబ్బంది --- ప్రస్తుత నీటి సంవత్సరంలో కూడా శ్రీశైలంలో కనిష్ఠ మట్టానికి నీ టి వినియోగం జరగనుంది. ఇప్పటికే కనీస నీటిమట్టం దిగువకు వెళ్లి పోగా, వచ్చే రెండు వారాల్లో మరింత దిగువకు పడిపోనుంది. బోర్డు ఆదేశాల ప్రకారం మరో 22 టీఎంసీల నీటిని శ్రీశైలం నుంచి నాగార్జు నసాగర్కు విడుదల చేయాలి. అప్పటికి నీటిమట్టం 802 అడుగులకు చేర ుతుంది. వచ్చే నెల రెండోవారంలోగా ఈ నీటి విడుదల పూర్త్యయ్యే అవ కాశం ఉంది. తర్వాత మూడు నెలల పాటు తాగునీటికి 802 అడుగుల దిగువ న ఉన్న నీటిపై రెండు రాష్ట్రాలు ఆధారపడాలి. గతంలో 775 అడుగుల వ రకు తీసుకొన్నారు. అంతకు మించితే బురద వస్తుంది. ఈ మట్టం వరకు తీసుకొన్నా పది టీఎంసీలకు మించి అందుబాటులో ఉండవు. వచ్చే ఖరీఫ్ సీజన్లో శ్రీశైలం కనీస నీటిమట్టానికి రావడానికే చాలా సమయం ప డుతుంది. ప్రస్తుత నీటి సంవత్సరంలో(గత జూన్ ఒకటి నుంచి) శ్రీశ ైలంలోకి 348.95 టీఎంసీల నీరు ఆలమట్టి ద్వారా కృష్ణా నది నుంచే వచ్చింది. తుంగభద్ర నుంచి ఈ సంవత్సరం ఎలాంటి నీటి లభ్యత లేదు. రెండు రాష్ట్రాలు సాగునీటి అవసరాలకు కనీస నీటిమట్టం పైన వినియో గించుకోవాలని, తాగునీటికి గతంలో లాగా దిగువన ఉన్న నీటిని వాడుక ోవచ్చనే అభిప్రాయం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశంలో వ్యక్ తమైనా, ప్రస్తుతం సాగునీటి అవసరాలకే కనీస నీటిమట్టం దిగువకు వి నియోగించారు. బోర్డు నిర్ణయం ప్రకారం ఇంకా వినియోగం జరుగుతుంది . శ్రీశైలం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, కనీస నీ టిమట్టం 834 అడుగులు. బుధవారం ఉదయానికి 830.80 అడుగులుండగా, ఈ నెల 15న బోర్డు జారీ చేసిన ఆదేశాల ప్రకారం నీటి విడుదల జరుగుతు ంది. బుధవారం 25,777 క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేశార ు. ప్రస్తుతం 50.35 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇంకా 22 టీఎంసీలన ు విడుదల చేయాలి. మరో రెండు వారాల్లో ప్రాజెక్టులో ఉండే నీటి ల భ్యత 28.25 టీఎంసీలు మాత్రమే. దీంతో వేసవిలో తాగునీటి సరఫరాకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది.
} |