| Author |
Message |
   
Abhysg
Hero Username: Abhysg
Post Number: 10897 Registered: 08-2008 Posted From: 68.46.32.32
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Saturday, September 07, 2013 - 08:36 am: |
    |
ivvala antha coverage poyinatle na... ashokudu chandrguptudi relative (manavad)... mingesada.. no siggy |
   
Jai_tdp
Hero Username: Jai_tdp
Post Number: 14780 Registered: 02-2009 Posted From: 99.125.251.21
Rating:  Votes: 1 (Vote!) | | Posted on Saturday, September 07, 2013 - 08:32 am: |
    |
Yatra is going on well. Tour antha core villages lo plan chesaru |
   
Abhysg
Hero Username: Abhysg
Post Number: 10888 Registered: 08-2008 Posted From: 68.46.32.32
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Saturday, September 07, 2013 - 07:31 am: |
    |
bob yatra coverage antha full p.... no siggy |
   
Dma
Hero Username: Dma
Post Number: 10142 Registered: 11-2009 Posted From: 72.201.132.90
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Saturday, September 07, 2013 - 07:22 am: |
    |
ఈ యాత్రలో చంద్రబాబు సమైక్యం అనే పదాన్ని వాడకుండానే తెలుగు జాలి ఐక్యతను గురించి, దానికి ఏమిచేయాలన్న విషయాలను ప్రజలకు వివరించటం ప్రారంభించారు. ముఖ్యంగా కాంగ్రెస్, వైసీపీ పార్టీల గుట్టును రట్టు చేయటంతో పాటు, ఆ పార్టీల నైజాన్ని బాబు ప్రజల ముందుంచుతున్నారు. దీనితో బాబు యాత్రకు రోజురోజుకు జనాధరణ విపరీతంగా పెరుగుతూ, ఆ ప్రాంత టిడిపి నాయకులను సైతం సంభ్రమాశ్యర్యాలకు గురి చేయటంతోపాటు వారిలో ఆత్మస్థర్యాన్ని నింపింది. అయితే బాబు గతంలో పాదయాత్ర చేసినప్పటిలాగా కూకుండా విన్నూత రీతిలో కాంగ్రెస్, వైసీపీలపై ఘాటైన విమర్శలు చేస్తున్నప్పుడు ప్రజల్లోనుంచి మంచి స్పంధన లభిస్తుంది. బాబు హావ భావాలతోపాటు, మాట్లాడే స్టయిల్, దానికి తగిన విధంగా బాడీ లాంగ్వేజ్, ఘాటైన పదాలు వాడటంతో ప్రజలు ఈలలు, చప్పట్లుతో బాబు ప్రసంగాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు. శుకృవారం మంగళగిరిలో నిర్వహించిన ఆత్మగౌరవ యాత్రలో బాబు ఎడ్ల బండిమీద ఎక్కి యాత్ర చేస్తూ ప్రజనుద్దేశించి మాట్లాడటం ప్రజల్లో, టిడిపి శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. <br/> <br/> ముఖ్యంగా రాష్ట్రం లోని ప్రస్తుత పరిస్థతికి కాంగ్రెస్, వైసీపీ, టిఆర్ఎస్లే కారణమని బాబు ప్రజలకు విడమర్చి చెప్పుతున్నారు. ప్రజల సొమ్ము లక్షల కోట్ల రూపాయలు దోచుకొన్న దానిపై సిబిఐ విచారణ జరిపి జగన్పై కేసులు నమోదు చేయటం జరిగిందని, దీనితో జగన్ జైలుపాలయ్యాడయ్యాడని, అయితే తన కొడుకును ఎలాగైనా జైలునుంచి బెయిలుపై బైటకు తీసుకు రావాలని జగన్ తల్లి కాంగ్రెస్లో కుమ్మకై్క అయ్యిందని, అందుకే ఒకటికి నాలుగుసార్లు ఢిల్లీ వెళ్ళి సోనియా గాంధీని, ప్రధాని మన్మోహన్సింగ్ను, రాష్ర్టపతిని, రాష్ట్ర కాంగెస్పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్ను కలిసి, తమ పార్టీని న్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీలో కలుపుతానని, తన కుమారునికి బైల్ ఇప్పించాలని బేరసారాలు కుదుర్చుకున్నారని బాబు ప్రజలకు వివరించటం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలోని టిఆర్ఎస్ తెలంగాణ ప్రకటించి బిల్లు పార్లమెంట్లో పెడితే, టిఆర్ఎస్ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని చెప్పటంవల్లనే, కాంగ్రెస్ ఇరు ప్రాంతాల ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా, ఏక పక్షంగా స తెలంగాణపై ప్రకటన చేసిందని బాబు ప్రజలకు వివరిస్తున్నారు.<br/> <br/> ఈ విషయాలను చెప్పెటప్పుడు వైసీపీ నేత జగన్ దొంగబ్బాయి, సోనియా కుమారుడు రాహుల్ గాంధీని మొద్దబ్బాయి అని బాబు సంబోధించటం ప్రజలను బాగా ఆకట్టుకుంటుంది.పైగా మూడుపార్టీలు తెలుగుజాతి ప్రజలపై విభజన చిచ్చు రగిలించి, ఏమి ఎరగని దానిలా టిడిపిపై ఆ నేరం వేయాలని, టిడిపిని దెబ్బ తీయాలని అనేక కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నాయని, ఈ ప్రయత్నాలను మీరంతా త్రిప్పి కొట్టాలని బాబు ప్రజలకు పిలుపు నిస్తున్నారు. బాబు ప్రసంగాలు వినటానికి ప్రజలు తండోప తండాలుగా సభలకు తరలి వస్తున్నారు. త్వరలో జరగబోయే సమైక్యరాష్ర్ట ఎన్నికల్లో మీరే ముఖ్యమంత్రని, విద్యార్థులు, మహిళలు, ప్రజలు, రైతులు, ఉద్యోగులు చంద్రబాబుని దీవిస్తున్నారు. విద్యార్థులు ప్రతి గ్రామంలో స్వాగతం పలకటంతోపాటు కాబోయే ముఖ్యమంత్రి మీరేనంటూ ప్లేకార్డులుతో ప్రదర్శనలు చేయటం చూస్తుంటే, బాబు నిర్వహిస్తున్న తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్రకు ఎంత పెద్దె ఎత్తున ప్రజా ఆధరణ లభిస్తుందో అర్థమవుతుంది.<br/> <br/> మొన్నటివరకు బాబు యాత్ర మా ప్రాంతంలో లేకుండా చేసుకోవాలని అనుకున్న టిడిపి శ్రేణులు,ఆయాప్రాంత ప్రజలే వచ్చి మాగ్రామాలకు యాత్ర రావాల్సిందేనని పట్టుపట్టడంతో టిడిపి నాయకుల్లో ఆనందం వెల్లి విరుస్తుంది. బాబు యాత్రవల్ల టిడిపికి గతంలో కంటేకూడా మరింత పట్టు దొరికిందని, అన్నిపార్టీలవారు టిడిపిలో చేరటానికి తహతహ లాడుతున్నారని టిడిపి నాయకులు ఉప్పొంగి పోతున్నారు. బాబు యాత్రకు వస్తున్న అపూర్వ ప్రజా స్పందనను చూసి కాంగెస్, వైసీపీలు ఖంగు తింటున్నాయి. మొత్తంమీద బాబు యాత్రకు ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు. <br/> తెలుగుజాతికి న్యాయం జరిగే వరకు పోరాడుతా తెలుగు జాతి ఆత్మగౌరవయాత్రలో భాగంగా శుక్రవారం రాత్రి గుంటూరు జిల్లా నుంచి ప్రకాశం బ్యారేజి మీదుగా కృష్ణాజిల్లా విజయవాడ నగరంలోకి చంద్రబాబు ప్రవేశించారు. అపంతరం కాళేశ్వరరావు మార్కెట్ వద్ద జరిగిన భారీ బహిరంగసభలో ప్రసంగించారు. దేశాన్ని ఆధునికంగా తీర్చిదిద్దిన రూపశిల్పుల్లో తాను ఒకడినని, తొమ్మిదేళ్లు సీఎంగా కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశానని, అయితే ఆ తర్వాత తొమ్మిదేళ్లలో కాంగ్రెస్ పాలకులు రాష్ట్రాన్ని అధోగతి పాల్జేశారని విమర్శించారు. <br/> <br/> సీమాంద్రలో కాంగ్రెస్ ఓడిపోనుంది కాబట్టే జగన్ మాస్క్ను వేసుకుని గెలిచేందుకు యత్నిస్తుందన్నారు. టీఆర్ఎస్ను కాంగ్రెస్ లో విలీనం చేసుకుని తెలంగాణలో అధిక సీట్లను సంపా దించాలని కుట్ర పన్నుతుందని ఆరోపించారు. ప్రధాన మంత్రి సోనియా చేతిలో కీలుబొమ్మగా మారారని, దేశ నిర్ణయాలన్ని సోనియానే డిక్టేట్ చేస్తుందని ఆరోపించారు. మన్మోహాన్ అసమర్ధుడిగా మిగిలిపోతున్నారని విమర్శిం చారు. తమ ప్రభుత్వ హాయాంలోనే హైదరాబాద్ అభివృద్ది చెందిందన్నారు. కేంద్రమంత్రులు, ఎంపిలు సోనియాకు తాబేదారులుగా మారిపోయారని విమర్శించారు. పిసిసి అధ్యక్షుడు బొత్స ఉత్సవవిగ్రహాంలా వ్యవహరిస్తున్నారని, ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి లీకు వీరుడుగా మారారని దుయ్యబట్టారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్తో కలవ బోమని టిఆర్ఎస్, వైకాపా నేతలు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. తెలుగు ప్రజల మద్య చిచ్చుపెట్టిన కాంగ్రెస్ అంతు చూసే వరకు నిద్రపోనని హెచ్చరించారు. సోనియా అల్లుడు, విజయమ్మ కుమారుడు జగన్ ఆస్తులను వేలం వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారిద్దరి ఆస్తులను వేలం వేస్తే దేశంలోని రైతులందరి అప్పులు తీరిపోతాయన్నారు. <br/> <br/> దేశంలో పిచ్చి తుగ్లక్ పాలన నడుస్తోందని, రాత్రి పూట పెట్రోల్ బంకులు మూసేస్తామని, బంగారం కొనడం మానేయాలని కేంద్ర మంత్రులు ప్రజలకు సూచిస్తున్నారని, ఆర్ధిక వ్యవస్ధ వినాశనానికి అసలు కారణమేంటో కనుక్కుని ముందుకు వెళ్లకుండా ఇలాంటి పిచ్చి ఆలోచనలు చేస్తున్నారని విమర్శించారు. స్విస్ బ్యాంకుల్లో ఉన్న అవినీతి సొమ్ము బయటకు తీస్తే దేశ ఆర్ధిక వ్యవస్ధ బాగుపడుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. విజయవాడ పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర నిర్వహించిన చంద్రబాబు శుక్రవారం రాత్రి అగ్రిగోల్డ్ (మహిళా పారిశ్రామికవాడ)లో బస చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు, నాగుల్మీరా, కేశినేని నాని, గద్దె రామ్మోహన్, బోండా ఉమా తదితరులు పాల్గొన్నారు. |
   
Dma
Hero Username: Dma
Post Number: 10141 Registered: 11-2009 Posted From: 72.201.132.90
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Saturday, September 07, 2013 - 07:21 am: |
    |
హైదరాబాద్/విజయవాడ, మేజర్న్యూస్ ః రాష్ట్ర విభజన సందర్బంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు తలపెట్టిన తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర సీమాంధ్రలో జోరుగా, హుషారుగా సాగుతుంది. తెలుగు జాతి ఐక్యత కోసం నిర్వహిస్తున్న ఈ యాత్రలో ప్రజలనుంచి అపూర్వ స్పందన లభిస్తుంది. యాత్ర ప్రారంభంలో సీమాంధ్రలోని కొంతమంది టిడిపి ఎం.పిలు, ఎమ్మెల్యేలు, నాయకుల్లో బాబు యాత్రను సీమాంధ్ర ప్రజలు ఏవిధంగా రిసీవ్ చేసుకుంటారోననే భయం ఉంది. అందుకే అగస్టు 25న యాత్రను ప్రారంభించాలని బాబు సన్నాహాలు చేసుకున్నా, సీమాంద్ర టిడిపి నాయకులు వద్దని చెప్పటంతో యాత్రను వాయిదా వేసుకోవటం జరిగింది. అయితే తాను ప్రజల్లోకి వెళ్ళి విభజనపై నిజాలను తెలియపరచకుంటే, సీమాంధ్రలో తాను దోషిగా మిగిలిపోతాననే భావన చంద్రబాబుకు రావటం, ఏదిఏమైనా ప్రజలకు నిజాలు తెలియచేయాలన్న గట్టి పట్టుదలతో, స్థానిక నాయకులను కూడా ఒప్పించి బాబు సెఫ్టెంబర్ 1వ తేదీన తెలుగు జాతి ఆత్మగౌరవ యాత్రను గుంటూరు జిల్లానుంచి ప్రారంభించారు. <br/> <br/> |
|