![]() ![]() ![]() ![]()
Biggboss
Side Hero Username: Biggboss
Post Number: 9630 Registered: 08-2017 Posted From: 24.6.111.180
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Monday, March 11, 2019 - 09:49 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
Looks like not many TT's selected "Interested" the only option in the survey దుబాయి సర్వీసు.. ఇప్పట్లో లేనట్టేఆసక్తి చూపించని విమానయాన సంస్థలుఈనాడు, అమరావతి గన్నవరం విమానాశ్రయం నుంచి దుబాయికి విమాన సర్వీసు కల ఇప్పట్లో సాకారమయ్యేలా లేదు. ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ(ఏపీఏడీసీఎల్) ఆధ్వర్యంలో దుబాయి సర్వీసు కోసం చేసిన ప్రయత్నం ఫలించలేదు. దుబాయికి సర్వీసులు నడిపేందుకు విమానయాన సంస్థలు ముందుకురాలేదు. గన్నవరం నుంచి దుబాయికి సర్వీసులు నడిపేందుకు అవసరమైన ద్వైపాక్షిక ఒప్పందాలు, అనుమతులు, సీట్ల వెసులుబాటు ఉన్న విమానయాన సంస్థలు ముందుకొచ్చేవరకూ ప్రక్రియ వాయిదా పడినట్టే. ఏపీఏడీసీఎల్ చేపట్టిన ప్రజాభిప్రాయసేకరణకు ప్రయాణికుల నుంచి లక్షల సంఖ్యలో విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. ప్రజాభిప్రాయ సేకరణకు వెబ్సైట్, ఈమెయిల్, వాట్సాప్, ఎస్ఎంఎస్ల రూపంలో 2.5లక్షల మంది వరకూ మద్దతు పలికారు. గతంలో సింగపూర్ సర్వీసును ఆరంభించే సమయంలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన మద్దతు కంటే.. దుబాయికి ఎక్కువ వచ్చింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వయబులిటీ గ్యాప్ ఫండింగ్(వీజీఎఫ్) పద్ధతిలో దుబాయి సర్వీసు నడిపేందుకు ఏపీఏడీసీఎల్ విమానయాన సంస్థలను ఆహ్వానిస్తూ బిడ్లను పిలిచింది. గత జనవరి 23 నుంచి ఫిబ్రవరి 2 వరకు సీల్డ్ కవర్ టెండర్ల దాఖలుకు అవకాశం ఇచ్చారు. ఫిబ్రవరి 11న బిడ్లను తెరిచి.. వీజీఎఫ్ను అతి తక్కువకు కోట్ చేసిన విమానయాన సంస్థకు సర్వీసులను నడిపేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. సంస్థను ఎంపిక చేసిన తర్వాత నెల రోజుల్లోనే దుబాయి సర్వీసును గన్నవరం నుంచి నడపాలని భావించారు. కానీ.. విమానయాన సంస్థలు ముందుకురాకపోవడంతో.. బిడ్ల దాఖలుకు గడువును మరికొంత పొడిగించినప్పటికీ విమాయాన సంస్థలు పెద్దగా ఆసక్తిచూపించడం లేదని ఏపీఏడీసీఎల్ అధికారులు వెల్లడించారు.}} |